బాలి(ఇండోనేషియా): సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో వరుసగా రెండో ఓటమితో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఇంటి దారిపట్టగా.. ఇప్పటికే సెమీస్కు అర్హత సాధించిన ప్రపంచ చాంపియన్ పీవీ సింధు ఆఖరి లీగ్ మ్యాచ్లో ఓటమి పాలైంది. శుక్రవారం పురుషుల సింగిల్స్ మూడో మ్యాచ్లో శ్రీకాంత్ 19-21, 14-21తో రెండో సీడ్ లీ జీ జియా (మలేషియా) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్ పోరులో సింధు 12-21, 21-19, 14-21తో టాప్ సీడ్ పోర్పవీ చొచువాంగ్ (థాయ్లాండ్) చేతిలో పరాజయం పాలైంది. గంటా 11 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్ కోల్పోయిన తెలుగమ్మాయి. ఆ తర్వాత రెండో గేమ్లో పుంజుకొని 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్లో చొచువాంగ్ విజృంభించగా.. సింధు వెనుకబడిపోయింది. దీంతో గ్రూప్-‘ఎ’లో సింధు రెండో స్థానంతో సెమీస్కు అర్హత సాధించింది. మహిళల డబుల్స్లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జంట 21-19, 9-21, 21-14 తేడాతో ఇంగ్లండ్ ద్వయం బిర్చ్, స్మిత్పై విజయంతో టోర్నీని ముగించింది.