IPL | ఐపీఎల్ ఆరంభానికి ఒక్క రోజు ముందు లక్నో సూపర్ జెయింట్స్ క్రికెటర్లు, కోచింగ్ సిబ్బంది గురువారం అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. లక్నో తరఫున ఆడనున్న సౌతాఫ్రికాకు చెందిన భారత సంతతి క్రికెటర్ కేశవ్ మహారాజ్తో పాటు స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, హెడ్కోచ్ జస్టిన్ లాంగర్, ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.