హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్లో కేసీఆర్ కప్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు శాఖ అధ్యక్షుడు కాసర్ల సురేందర్ రెడ్డి తెలిపారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందాక ఆస్ట్రేలియాలో ఉన్న భారతీయులందరికీ కేసీఆర్ తెలంగాణాలో చేసిన అభివృద్ది, కేసిఆర్ భావజాల వ్యాప్తి చేయడానికి క్రికెట్ టోర్నమెంట్ను ఎన్నుకున్నామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
కేసీఆర్ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే అజెండా ఎన్నారైలందరికీ చేరుతుందని అందుకే తాము క్రికెట్ టోర్నమెంట్ ఎంచుకున్నామని ఆయన తెలిపారు.