ఢాకా: బంగ్లాదేశ్తో సిల్హెట్ ఇంర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక(Srilanka) 328 పరుగులు తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 511 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. అయిదో రోజు 49 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. లంక బౌలర్ కసున్ రజిత దుమ్మురేపాడు. రెండో ఇన్నింగ్స్లో 56 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో కూడా రజిత సూపర్గా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో అతను 56 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో అతను ఈ మ్యాచ్లో 8 వికెట్లు తీశాడు.
బంగ్లాదేశ్పై భారీ విజయాన్ని నమోదు చేసిన శ్రీలంక.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్సిప్ స్టాండింగ్స్లో మెరుగుపడింది. నిన్నటి వరకు ఆ పట్టికలో సున్నా పాయింట్లతో దిగువన ఉన్న శ్రీలంక.. ఇప్పుడు ఆరవ స్థానంలో బంగ్లాదేశ్తో సంయుక్తంగా నిలిచింది. ఈమ్యాచ్లో విజయం సాధించిన శ్రీలంక 12 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం దిగువ స్థానంలో సౌతాఫ్రికా ఉన్నది.
స్కోరుబోర్డు
శ్రీలంక 280 & 418
బంగ్లాదేశ్ 188 & 182
Sri Lanka move up in the ICC World Test Championship standings after sealing a resounding win in Sylhet.#BANvSL | #WTC25 | Details 👇https://t.co/jndxG14WmZ
— ICC (@ICC) March 25, 2024