హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ సైకిలిస్టుల గ్రూపు(హెచ్సీజీ) ఆధ్వర్యంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ రేసు జరుగనుంది. ఈ నెల 30వ తేదీన శ్రీనగర్లో మొదలయ్యే రేసు 3700కి.మీల పాటు సాగనుంది. ఇందులో ఇద్దరు మహిళా సైక్లిస్టులు సహా 12 మంది బరిలోకి దిగుతున్నారు. ఈ రేసుకు సంబంధించిన పోస్టర్ను హెచ్సీజీ అధ్యక్షుడు మర్రి లక్ష్మణ్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. రేసులో పాల్గొంటున్న కే2కే 2022 టీమ్ను ఆయన అభినందించారు.