ఎమ్మార్పీఎస్ నేతలు పాపయ్య, వంగపల్లి
ముషీరాబాద్, జూన్ 26: రాష్ట్రంలో దళిత వర్గాల అభివృద్ధిపై చర్చించడానికి ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయడంపై ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య, వంగపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ దళితుల సమస్యల విషయంలో తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న అఖిలపక్ష సమావేశానికి దళిత ఉద్యమకారులను ఆహ్వానించాలని కోరారు. దళితులకు ప్రభుత్వ పథకాలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలపై చర్చించి మార్గనిర్దేశం చేయాలని కోరారు.