ఆక్లాండ్: వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీ కావడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు అనుభవానికి పెద్దపీట వేస్తూ 15 మందిని ఎంపిక చేసింది.
సెంట్రల్ కాంట్రాక్ట్లకు దూరమైన స్టార్ పేసర్ ట్రెంట్ బోల్ట్, ఆల్రౌండర్ నీషమ్కు జట్టులో చోటు కల్పించింది. దాదాపు ఆరు నెలలుగా ఆటకు దూరమైన సీనియర్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.