కురవి, నవంబర్ 3: ‘ఈఎంఆర్ఎస్’ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో కల్వకుర్తి చాంపియన్గా నిలిచింది. గురువారం జరిగిన బాలుర అండర్-19 ఫైనల్లో బాలానగర్పై కల్వకుర్తి విజయం సాధించింది. మూడో రోజు 17 రకాల క్రీడల్లో హోరాహోరీ పోరాటాలు సాగాయి.
అండర్-19, అండర్-14 విభాగాల్లో అథ్లెటిక్స్ పోటీలు పూర్తికాగా ఆర్చరీ పోటీలను జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల గురుకులాల ఆర్సీవో రాజ్యలక్షి, రాష్ట్ర గురుకుల స్పోర్ట్స్ ఆర్గనైజర్ రమేశ్ ప్రారంభించారు. కబడ్డీ మ్యాచ్లు ప్రొ కబడ్డీ లీగ్ను తలపించాయి.
అండర్-19 కబడ్డీ బాలికల ఫైనల్లో ఎల్లారెడ్డిపేటపై నెగ్గిన సిరోలు కప్పు చేజిక్కించుకుంది. అండర్-19 బాలికల ఫుట్బాల్ ఫైనల్లో సీరోలును చిత్తు చేసి కురవి విజేతగా నిలిచింది. అండర్-17 బాలుర కబడ్డీ ఫైనల్లో కొత్తగూడపై నెగ్గిన కల్వకుర్తి మొదటి స్థానంలో నిలిచింది.