యాంక్టన్(అమెరికా): ఆర్చరీ ప్రపంచ చాంపియన్షిప్లో తెలుగు స్టార్ ఆర్చర్ వన్నెం జ్యోతిసురేఖ క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత విభాగంలో సురేఖ 146-142 తేడాతో చైవోన్ సో(కొరియా)పై అద్భుత విజయం సాధించింది. తొలి రెండు రౌండ్లలో ప్రత్యర్థిపై 59-58 ఆధిక్యంలో నిలిచిన సురేఖ..117-116తో ఆఖరి రౌండ్లోకి ప్రవేశించింది. మిగతా విభాగాల్లో అంకితా భక్త్, అభిషేక్వర్మ క్వార్టర్స్కు అర్హత సాధించారు. ఇక టోర్నీలో ఇప్పటికే భారత్ రెండు పతకాలు ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం జరిగే మహిళల కాంపౌండ్ ఈవెంట్తో పాటు మిక్స్డ్ ఫైనల్లో భారత ఆర్చర్లు బరిలోకి దిగనున్నారు.