Rinku Singh : వెస్టిండీస్తో పొట్టి సిరీస్కు భారత బృందం ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ 16వ సీజన్లో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన రింకూ సింగ్(Rinku Singh)కు చోటు దక్కకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘జస్టిస్ ఫర్ రింకూ’ అని సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అజిత్ అగార్కర్(Ajit Agarkar) నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై దుమ్మెత్తి పోస్తున్నారు.
అగార్కర్ చీఫ్ సెలెక్టర్గా బాధ్యతలు చేపట్టడంతో క బీసీసీఐ నిన్న టీ20 స్క్వాడ్ను ప్రకటించింది. ఆ జాబితాలో కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) తరఫున దుమ్మురేపిన రింకూ పేరు కచ్చితంగా ఉంటుందని ఊహించారంతా. కానీ, సెలెక్టర్లు ఈ లెఫ్ట్హ్యాండర్ను విస్మరించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.
Justice for Rinku Singh 💔😞#WIvIND #RinkuSingh pic.twitter.com/6GRHR62sGx
— Shreyas Aryan (@Ariyen34) July 5, 2023
ఐపీఎల్ పదహారో సీజన్లో రింకూ సింగ్ సంచలనం సృష్టించాడు. క్రీజులోకి రావడమే ఆలస్యం సిక్సర్లతో మోత మోగించాడు. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) యశ్ దయాల్ (Yash Dayal)వేసిన ఆఖరి ఓవర్లో ఐదు సిక్స్లతో అతడి ఊచకోత మొదలైంది. ఆ మ్యాచ్తో ఒక్కసారిగా హీరో అయిన రింకూ ఆ తర్వాత నుంచి ప్రతి మ్యాచ్లో ఫినిషర్గా కోల్కతాకు విజయాలు అందించాడు.
రింకూ సింగ్
ఆఖరి ఓవర్లలో సిక్సర్లతో విరుచుకుపడుతూ ప్రత్యర్థి జట్లను హడలెత్తించాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ సీజన్లో 149 స్ట్రైక్ రేటుతో 474 పరుగులు సాధించాడు. దాంతో, త్వరలోనే రింకూ టీమిండియా జెర్సీ వేసుకోవడం ఖాయమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
కానీ, వెస్టిండీస్ టూర్కు సెలెక్టర్లు అతడి బదులు తెలుగు ఆటగాడు తిలక్ వర్మ(Tilak Verma)ను సెలెక్ట్ చేశారు. దాంతో, ఆగ్రహించిన అభిమానులు బీసీసీఐ తీరును తప్పుపడుతూ ఆన్లైన్లో పోస్టులు పెడుతున్నారు. వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు ఐదు టీ20లు ఆడనుంది. మొదటి టెస్టు బార్బడాస్లో జూలై 12న మొదలుకానుంది. జూన్ 27న టీ 20 సిరీస్ ప్రారంభమవుతుంది.
టీ20 స్క్వాడ్ : హార్దిక్పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్యాదవ్(వైస్ కెప్టెన్), ఇషాన్కిషన్, గిల్, యశస్వి జైస్వాల్, తిలక్వర్మ, శాంసన్, అక్షర్పటేల్, చాహల్, కుల్దీప్యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేశ్ఖాన్, ముకేశ్ కుమార్.