టోక్యో: తీవ్రవాద సంస్థలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఒలింపిక్స్లో స్వర్ణం ఎలా గెలుస్తాడని దక్షిణకొరియా స్టార్ షూటర్ జిన్ జాంగ్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ)ని ప్రశ్నించాడు. టోక్యో ఒలింపిక్స్లో భాగంగా జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన ఇరాన్ ఆటగాడు జావేద్ను ఉద్దేశిస్తూ జిన్ పై విధంగా వ్యాఖ్యానించాడు. జావేద్.. ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సభ్యుడిగా ఉన్నాడు. 2019లో ఐఆర్జీసీని అమెరికా తీవ్రవాద సంస్థగా గుర్తించింది. కాగా, ఇదే విషయాన్ని జిన్ ఎత్తిచూపుతూ ఐవోసీపై విమర్శలు గుప్పించాడు. ఇది పూర్తిగా ‘పిచ్చి చర్య’ అని అభిప్రాయపడ్డాడు. జావేద్కు స్వర్ణం రావడంపై ఇరాన్ హ్యూమన్ రైట్స్ అథ్లెటిక్స్ ఆర్గనైజేషన్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది.