Jhulan Goswami : భారత మహిళల జట్టు( India Womens Team)కు ఆడిన గొప్ప క్రికెటర్లలో ఝులాన్ గోస్వామి(Jhulan Goswami) ఒకరు. రెండు దశాబ్దాలు భారత బౌలింగ్ దళాన్నినడిపించిన ఆమె టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించింది. అయితే.. రెండేళ్ల క్రితం అనూహ్యంగా క్రికెట్కు వీడ్కోలు పలికి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. రిటైర్మెంట్ నిర్ణయం వెనుక గాయాలతో సతమైన రోజులు, కన్నీళ్లను దిగమింగిన సందర్భాలు ఉన్నాయని గోస్వామి తాజాగా వెల్లడించింది.
మాజీ క్రికెటర్ అంజుమ్ చోప్రా(Anjum Chpra)తో యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ… ‘2022 వరల్డ్ కప్(2022 ODI WC) తర్వాత క్రికెట్కు గుడ్ బై చెప్పాలని ముందే అనుకున్నా. గాయాల కారణంగా క్రికెట్ను ఆస్వాదించలేకపోయాను. తరచూ గాయలు వెంటాడడంతో సరిగ్గా నిద్ర పట్టేది కాదు. నిద్రిస్తున్నప్పుడు ఎడమ పక్కకు మళ్లడం కష్టంగా ఉండేది. అంతేకాదు షూ లేస్ కట్టుకోవడం కూడా కష్టమనిపించేది. అందుకనే ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా’ అని గోస్వామి వెల్లడించింది.
ఝులాన్ గోస్వామి
భారత క్రికెట్కు ఎనలేని సేవ చేసిన ఆమె ఈ మధ్యే ప్రతిష్ఠాత్మక ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీ MCC World Cricket Committee)కి ఎంపికైంది. ఆమెతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(Eoin Morgan), హీథర్ నైట్(Heather Knight)లకు కూడా ఎంసీసీ సభ్యత్వం లభించింది.
బెంగాల్లో పుట్టిన గోస్వామి 2002లో భారత జట్టులోకి వచ్చింద. 20 ఏళ్ల పాటు విజయవంతమైన బౌలర్గా కొనసాగింది. 2022 సెప్టెంబర్లో ఇంగ్లండ్పై వన్డే సిరీస్ విజయం తర్వాత గోస్వామి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. అన్ని ఫార్మాట్లలో 384 మ్యాచ్లు ఆడిన ఈ ఫాస్ట్ బౌలర్ 355 వికెట్లు పడగొట్టింది. స్ఫూర్తి దాయకమైన ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘చక్దే ఎక్స్ప్రెస్'(Chakda Xpress) సినిమా వచ్చింది. అనుష్కా శర్మ(Anushka Sharma) లీడ్ రోల్ చేసిన ఈ మువీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఉంది. మహిళల ప్రీమియర్ లీగ్(Womens Premier League)లో ముంబై ఇండియన్స్ జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్గా గోస్వామి బాధ్యతలు నిర్వహించింది.