పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా మెగాటోర్నీకి దూరం కాగా.. ఇప్పుడా జాబితాలో ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేరాడు. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా.. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు దూరమయ్యాడు. ఆసియాకప్లో ఆడని బుమ్రా.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్కు జట్టులోకి వచ్చి.. రెండు మ్యాచ్లు ఆడాడో లేదో గాయం తిరగబెట్టడంతో మరోసారి జట్టుకు దూరమయ్యాడు.
పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా మెగాటోర్నీకి దూరం కాగా.. ఇప్పుడా జాబితాలో ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేరాడు. గత కొంత కాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా.. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్నకు దూరమయ్యాడు. ఆసియాకప్లో ఆడని బుమ్రా.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్కు జట్టులోకి వచ్చి.. రెండు మ్యాచ్లు ఆడాడో లేదో గాయం తిరగబెట్టడంతో మరోసారి జట్టుకు దూరమయ్యాడు.
న్యూఢిల్లీ: నిరుడు యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లీగ్ దశలోనే వెనుదిరిగి నిరాశ పరిచిన టీమ్ఇండియా.. ఈ సారైనా కప్పు కొడుతుందని ఆశిస్తే.. మెగాటోర్నీ ప్రారంభానికి ముందే జట్టుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత కొన్నాళ్లుగా భారత బౌలింగ్ విభాగానికి దళపతిగా వ్యవహరిస్తున్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో టీ20 వరల్డ్కప్నకు దూరమయ్యాడు. వచ్చే నెల 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా పొట్టి ప్రపంచకప్ జరుగనుండగా.. బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకునేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. దీంతో ఏస్ పేసర్ మెగాటోర్నీలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే మెకాలి గాయంతో స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు దూరం కాగా.. తాజాగా బుమ్రా కూడా గాయపడటంతో భారత విజయావకాశాలపై పెను ప్రభావం చూపే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆసియాకప్ సమయంలో బుమ్రా గాయంతో ఇబ్బంది పడుతుండటంతో అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదు. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్కు అతడిని తీసుకోగా.. కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడి తిరిగి గాయపడ్డాడు.
మెగాటోర్నీకి ప్రధాన పేసర్ అందుబాటులో లేకుండా పోవడంతో అతడి స్థానంలో మరో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని ఎంపిక చేయాలని బోర్డు భావిస్తున్నది. ప్రస్తుతం కరోనా బారిన పడి క్వారంటైన్లో ఉన్న షమీ వరల్డ్కప్ జట్టులో స్టాండ్బై ప్లేయర్గా కొనసాగుతున్నాడు. దీంతో అతడిని ప్రధాన జట్టులో చేర్చి.. స్టాండ్బైగా హైదరాబాదీ పేస ర్ మహమ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్లో ఒకరిని ఎంపిక చేసే చాన్స్ ఉంది. స్టాండ్బైగా ఉన్న దీపక్ చాహర్ను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోనున్నారు. విభిన్నమైన బౌలింగ్ శైలితో బుమ్రా వెన్నుపై అధిక భారం పడుతుందని.. విండీస్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్ వంటి వాళ్లు కెరీర్ ఆరంభం నుంచి అంటూనే ఉన్నారు. ఇప్పుడదే నిజమైనట్లు అనిపిస్తున్నది. ప్రస్తుతం బుమ్రా వెన్ను గాయానికి శస్త్రచికిత్స అవసరం లేకున్నా.. పూర్తి స్థాయిలో కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఇటీవలి కాలంలో బ్యాటర్లు రాణిస్తున్నా.. డెత్ ఓవర్స్లో బౌలింగ్ లోపాలతో భారత్ చాలా మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. బుమ్రా రాకతో డెత్ సమస్య తీరుతుందనుకుంటే.. అదీ అడియాశ అయి ంది. దీంతో అభిమానులు బోర్డు వ్యవహారశైలిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
బుమ్రా గాయంపై సరైన స్పష్టత లేకుండానే అతడి ఫిట్నెస్తో బోర్డు ఆటలాడుకుంటున్నదని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాసులు కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సమయంలో వెలుగుచూడని సమస్యలు.. జాతీయ జట్టుకు వచ్చే సరికి గుర్తుకొస్తాయా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్లో 14 మ్యాచ్లు ఆడేందుకు ఫిట్నెస్ ఉంటుంది కానీ.. బ్లూ జెర్సీలో మూడు మ్యాచ్లు ఆడకముందే గాయం తిరగబెట్టిందా అని అభిమానులు అక్కసు వెల్లగక్కుతున్నారు. ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత్ ఫైనల్ చేరకుండానే వెనుదిరిగేందుకు ప్రధాన కారణం.. డెత్ ఓవర్స్ బౌలింగ్ అన్న విషయం తెలిసిందే. అప్పుడు జట్టులో లేని బుమ్రా.. ఆసీస్తో సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్ ఆడని జస్ప్రీత్.. నాగ్పూర్లో (8 ఓవర్ల మ్యాచ్) రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ పోరులో కోటా (4 ఓవర్లు) పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్కు ఎంపికైన అతడు.. తిరువనంతపురం వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో గాయం కారణంగానే ఆడలేదు. ఆసియాకప్ తర్వాత కేవలం ఆరు ఓవర్లు బౌలింగ్ వేయడంతోనే బుమ్రా గాయం తిరగబెట్టిందంటే.. అతడి ఫిట్నెస్పై కొత్త సందేహాలు తలెత్తుతున్నాయి.
టీ20 ప్రపంచకప్ టోర్నీకి బుమ్రా అందుబాటులో ఉండడు. అతడి గాయం తీవ్రమైనది. దాన్నుంచి కోలుకునేందుకు దాదాపు ఆరు నెలల సమయం పట్టొచ్చు. జడేజా, బుమ్రా అందుబాటులో లేకపోవడం టీమ్ఇండియాకు పెద్ద దెబ్బే. పనిభారం కారణంగా గాయపడ్డాడని చెప్పలేం. ఎందుకంటే ప్రధాన ఆటగాళ్లందరికీ విడతల వారిగా విశ్రాంతినిస్తున్నాం. అతడు భారత బౌలింగ్ ప్రధాన అస్త్రం. రిస్క్ తీసుకోలేం. ప్రస్తుతానికి బుమ్రా.. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతాడు.
– బీసీసీఐ అధికారి