దుబాయ్: పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah)ను.. ఐసీసీ మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇవాళ ఆ ప్రటకన చేసింది. స్వదేశీతో పాటు విదేశీ పిచ్లపై .. 20204లో బుమ్రా సత్తా చాటాడు. తన స్పీడ్ బౌలింగ్తో భారత్కు కీలక విజయాలను అందించాడు. 2024లో అతను 13 టెస్టు మ్యాచ్లు ఆడి.. 71 వికెట్లను తీసుకున్నాడు. వెన్ను గాయం నుంచి కోలుకుని మళ్లీ టెస్టులు ఆడిన బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 31 ఏళ్ల బుమ్రా గత ఏడాది 14.92 సగటుతో వికెట్లు తీసుకున్నాడు. ఐసీసీ తన ప్రెస్ రిలీజ్లో బుమ్రా బౌలింగ్ రికార్డులను విశేషేంగా మెచ్చుకున్నది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్తో జరిగిన స్వదేశీ సిరీస్లో భారత జట్టు విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ల్లోనూ అతను అత్యధికంగా వికెట్లను తీశాడు.
‘Game Changer’ Jasprit Bumrah is awarded the ICC Men’s Test Cricketer of the Year 2024 🥁🥁
Bumrah took 71 wickets at a stunning average of 14.92, finishing as the highest wicket taker in Test cricket in 2024.#TeamIndia | @Jaspritbumrah93 pic.twitter.com/WHUciUK2Qb
— BCCI (@BCCI) January 27, 2025