Asia cup 2023 : ఆసియా కప్లో భారత జట్టు(Team India)కు పెద్ద షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) కీలకమైన నేపాల్(Nepal) మ్యాచ్కు దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతను భారత్కు వచ్చేశాడు. ఇంత హడావిడిగా బుమ్రా స్వదేశానికి వచ్చేయడానికి కారణం ఏంటీ? అనేది మాత్రం తెలియడం లేదు. అయితే.. ఈ యార్కర్ కింగ్ మరికొన్ని రోజుల్లోనే జట్టుతో కలుస్తాడని సమాచారం.
టీమిండియా సూపర్ 4(Super-4)కు అర్హత సాధించాలంటే నేపాల్పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అంత కీలకమైన పోరుకు బుమ్రా లేకపోవడం నిజంగా పెద్ద లోటు అని చెప్పాలి. అతడి స్థానంలో ఏ పేసర్ను తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్ సిరీస్(Ireland Series)తో పునరాగమనం చేసిన బుమ్రా మళ్లీ ఫామ్ అందుకున్నాడు. రెండు టీ20ల్లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో, బీసీసీఐ అతడిని ఆసియా కప్ పోటీలకు ఎంపిక చేసింది.
జస్ప్రీత్ బుమ్రా
నిన్న పాకిస్థాన్పై బుమ్రా ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. 14 బంతుల్లో 3 ఫోర్లు బాది 16 పరుగులు చేశాడు. అనంతరం బౌలింగ్లోనూ ఇరగదీయాలని అనకున్నాడు. కానీ, పాక్ ఇన్నింగ్స్కు వర్షం అడ్డుపడడంతో మ్యాచ్ రద్దయింది. దాంతో, రిఫరీలు ఇరుజట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు. తొలి మ్యాచ్లో నేపాల్ను చిత్తు చేసిన పాక్ గ్రూప్ ఏలో 3 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ ఒక పాయింట్తో రెండో స్థానంలో కొనసాగుతోంది.