దుబాయ్: భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్-10లోకి ప్రవేశించాడు. ఓవల్లో అద్భుత స్పెల్తో ఇంగ్లండ్ వెన్నువిరిచిన బుమ్రా 771 పాయింట్లతో.. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో తొమ్మిదో ర్యాంక్కు చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో ప్యాట్ కమిన్స్(908) నంబర్వన్ ర్యాంక్లో ఉండగా అశ్విన్(831) రెండో స్థానంలో నిలిచాడు. ఇక బ్యాటింగ్లో జో రూట్(903) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ నుంచి రోహిత్ శర్మ(813), విరాట్ కోహ్లీ(783) వరుసగా ఐదు, ఆరు ర్యాంక్ల్లో ఉన్నారు. ఓవల్ టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన శార్దూల్ ఠాకూర్.. తన ర్యాంకును మెరుగుపర్చుకున్నాడు. బ్యాటింగ్లో 79, బౌలింగ్లో ఏడు ర్యాంక్లు ఎగబాకి 49వ ర్యాంకుకు చేరాడు.