హైదరాబాద్: ఆర్సీబీతో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో కోల్కతా బ్యాటర్ జేసన్ రాయ్ (Jason Roy)కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్లో అతను 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. కోహ్లీ సేనపై 21 రన్స్ తేడాతో కోల్కతా జట్టు గెలిచేసింది. కానీ ఆ మ్యాచ్లో రాయ్ ప్రవర్తన సరిగా లేని కారణంగా.. బీసీసీఐ అతనికి జరిమానా విధించింది. విజయ్కుమార్ విశాఖ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిన రాయ్.. ఆవేశంలో తన చేతిలో ఉన్న బ్యాట్తో బెయిల్స్ను కొట్టాడు. అంతేకాదు, పెవిలియన్కు వెళ్తూ బ్యాట్ను గాలిలోకి విసిరేశాడు కూడా.
Cleaned up 🔥🎯
A leg-stump yorker by Vijaykumar Vyshak to put an end to Jason Roy's innings 👌🏻👌🏻#TATAIPL | #RCBvKKR pic.twitter.com/fID5xANmL0
— IndianPremierLeague (@IPL) April 26, 2023
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ప్రకారం .. రాయ్కు మ్యాచ్లో 10 శాతం మ్యాచ్ ఫీజులో ఫైన్ వేశారు. ప్రవర్తనా నియమావళి లెవల్ వన్ ఉల్లంఘన జరిగిందని, మ్యాచ్ రిఫరీ నిర్ణయమే తుది అని ఐపీఎల్ తన ప్రకటనలో తెలిపింది. ఈ సీజన్లో ప్రవర్తనా నియమావళి ప్రకారం శిక్ష పడినవారిలో రాయ్ రెండో ప్లేయర్. స్లో ఓవర్ రేటు కారణంగా ఈ సీజన్లో విరాట్ కోహ్లీకి ఫైన్ పడిన విషయం తెలిసిందే.