బెంగుళూరు: జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీని ఆ జట్టును సొంతం చేసుకోనున్నది. కర్నాటకతో జరుగుతున్న ఫైనల్లో జమ్మూకశ్మీర్ విజయం దాదాపు ఖాయమైంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని సాధించిన జమ్మూకశ్మీర్.. చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోనున్నది. ఇవాళ అయిదో రోజు ఆట కొనసాగుతోంది. అయితే ఆ సంబరాల్లో పాల్గొనేందుకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) తన బృందంతో కలిసి బయలుదేరారు. హూబ్లీలో జరుగుతున్న క్రికెట్ వేదికకు ఆయన చేరుకున్నారు.
శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు మరికొంత మంది నేతలు హుబ్లీకి బయలుదేరి వెళ్లారు. ఫైనల్లోకి ప్రవేశించిన జమ్మూకశ్మీర్ జట్టు తమ రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నట్లు ఆయన చెప్పారు. స్టాండ్స్లో ఉండి తమ జట్టుకు చీర్ చేయాలనుకుంటున్నట్లు ఒమర్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్నగర్లోని కేఎస్సీఏ స్టేడియంకు చేరుకుని తమ రాష్ట్ర జట్టుకు అభివాదం చేశారు.
Hubballi, Karnataka: Jammu and Kashmir CM Omar Abdullah arrived at KSCA Stadium, Rajnagar, for the final day of the Ranji Trophy and was welcomed by KSCA officials. pic.twitter.com/nw0eAeZENI
— IANS (@ians_india) February 28, 2026