ఐవోఏ సీఈవోను కోరిన జగన్మోహన్రావు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణకు జాతీయక్రీడలను నిర్వహించే అవకాశమివ్వాలని భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ)సీఈవో కల్యాణ్ చౌబేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు కోరారు. ఫుట్బాల్ ఐ-లీగ్లో భాగంగా ఆదివారం శ్రీనిధి దక్కన్ ఎఫ్సీ, నెరోకా ఎఫ్సీతో జరిగిన మ్యాచ్కు జగన్తో పాటు కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవలే హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్ను కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో జాతీయ క్రీడల అంశం చర్చకు వచ్చింది. వచ్చే నాలుగేండ్ల వ్యవధిలో నేషనల్ గేమ్స్ నిర్వహణ తమకు ఇవ్వాలని జగన్ కోరగా అందుకు కల్యాణ్ సానుకూలంగా స్పందించారు. దీంతో పాటు ఇటీవల ముంబైల జరిగిన ఐవోసీ సమావేశాల గురించి ఇరువురు చర్చించుకున్నారు. ఈ భేటీలో రాష్ట్ర ఫుట్బాల్ సంఘం కార్యదర్శి ఫాల్గుణ పాల్గొన్నారు.