BWF Championships : బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్స్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి పోరాటం ముగిసింది. కచ్చితంగా పతకం గెలుస్తారనుకున్న ఈ ద్వయం క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో వరల్డ్ నంబర్ 3 లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ చాంగ్ ధాటికి భారత జోడీ చేతులెత్తేసింది. దాంతో, మూడోసారి ఈ టోర్నమెంట్లో పతకంతో మురవాలనుకున్న సాత్విక్ – చిరాగ్ ఆశలు ఆవిరయ్యాయి.
నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్స్లో శుక్రవారం భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల డబుల్స్లో గాయత్రి గోపిచంద్ – త్రిసా జాలీ ద్వయం క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా.. పురుషుల జంట మాత్రం నిరాశపరిచింది.
It wasn’t meant to be 💔
A visibly disappointed Satwik – Chirag thanked the home crowd for their support and applauded Liang-Wang on their win!
Wishing SatChi to comeback stronger next time 🤗#bwfworldchampionships #newdelhi2026 pic.twitter.com/ipr6Z59HZ9
— BAI Media (@BAI_Media) August 21, 2026
ఈ ఛాంపియన్షిప్స్లో ఇది వరకు రెండుసార్లు మెడల్ కొల్లగొట్టిన సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్స్ దాటలేదు. మూడో సీడ్ లియాంగ్ వీ కెంగ్ – వాంగ్ చాంగ్తో పోరులో తేలిపోయిన భారత జంట 18-21, 9-21తో చిత్తుగా ఓడింది. తొలి సెట్లో కాస్త పోరాడినా.. రెండో సెట్లో ప్రత్యర్థికి బదులివ్వలేక మ్యాచ్ను అప్పగించేసింది సాత్విక్ చిరాగ్ ద్వయం. 2022, 2025లో చెలరేగి ఆడిన ఈ జోడీ కాంస్యం గెలుపొందిన విషయం తెలిసిందే.