Aasia Cup 2023 : టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) దెబ్బకు నేపాల్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ స్టార్ బౌలర్ భీమ్ షర్కి (7)ను బౌల్డ్ చేసి తొలి వికెట్ సాధించాడు. ఆ తర్వాత రోహిత్ పౌడెల్(5), కుశాల్ మల్లా(2)ను పెవిలియన్ పంపి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. జడ్డూ విజృంభణతో నేపాల్ స్కోర్ మందగించింది. 25 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. గుల్షన్ ఝా(6), ఓపెనర్ అసిఫ్ షేక్(47) క్రీజులో ఉన్నారు.
He’s on a roll this @imjadeja! 👏 👏
Third strike with the ball for him 🙌 🙌
Follow the match ▶️ https://t.co/i1KYESEMV1 #AsiaCup2023 | #TeamIndia | #INDvNEP pic.twitter.com/X9GhyrH5X1
— BCCI (@BCCI) September 4, 2023
టాస్ గెలిచిన రోహిత్ శర్మ(Rohit Sharma) నేపాల్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. ధాటిగా ఆడుతున్న ఓపెనర్లు కుశాల్ భ్రుటెల్(38), అసిఫ్ షేక్ ధాటిగా ఆడారు. భారత ఫీల్డర్లు మూడు క్యాచ్లు నేలపాలు చేయడం వీళ్లకు కలిసొచ్చింది. ఈ ఇద్దరూ తొలి వికెట్కు 65 రన్స్ జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని శార్దూల్ ఠాకూర్ విడదీశాడు. ఠాకూర్ ఓవర్లో కుశాల్ ఇషాన్ కిషన్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా రాకతో వికెట్ల వేట మొదలైంది.