IND vs WI : టెస్టు సిరీస్లో వెస్టిండీస్ను చిత్తు చేసిన భారత జట్టు తొలి వన్డేలో(ODI Series) తడాఖా చూపించింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 3, కుల్దీప్ యాద్ 4 వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టు 114 పరుగులకే కుప్పకూలింది. బార్బడాస్లోని కెన్షింగ్టన్ ఓవల్(Kensington Oval)లో జరిగిన మ్యాచ్లో విండీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. కెప్టెన్ షై హోప్ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేటికే హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) తొలి వికెట్ తీశాడు. తన రెండో ఓవర్లోనే డేంజరస్ ఓపెనర్ కైల్ మేయర్స్(2)ను ఔట్ చేశాడు. దాంతో, ఏడు పరుగుల వద్దే విండీస్ తొలి వికెట్ కోల్పోయింది.
Innings break!
A wonderful bowling display from #TeamIndia restricts West Indies to 114 👏👏
4️⃣ wickets for @imkuldeep18
3️⃣ wickets for @imjadeja
A wicket each for @hardikpandya7, @imShard, & debutant Mukesh KumarScorecard – https://t.co/OoIwxCvNlQ……#WIvIND pic.twitter.com/ctMLaYNJbn
— BCCI (@BCCI) July 27, 2023
ఆ తర్వాత బ్రాండన్ కింగ్(17), అలిక్ అథనజే(22) రన్స్ చేసి ఔటయ్యారు. రెండేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన విధ్వంసక ఆటగాడు షిమ్రాన్ హిట్మైర్(11), ఆల్రౌండర్ రోవ్మన్ పావెల్(4) నిరాశపరిచారు. వన్డేల్లో ఆరంగేట్రం చేసిన ముకేశ్ కుమార్ ఆకట్టుకున్నాడు. తొలి ఓవరే మెయిడెన్ వేయడమే కాకుండా కీలకమైన అలిక్ అథనజే వికెట్ సాధించాడు.