England : ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాక్. స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ (Jack Leach) భారత్తో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మోకాలి గాయం(Knee Injury)తో బాధపడుతున్న లీచ్ ఇంకా కోలుకోలేదు. దాంతో, మెరుగైన చికిత్స కోసం ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని ఆదివారం ఇంగ్లండ్ మేనేజ్మెంట్ వెల్లడించింది.
‘అబుదాబీ నుంచి లీచ్ మరో 24 గంటల్లో ఇంగ్లండ్కు బయల్దేరతాడు. స్వదేశంలో ఇంగ్లండ్ బోర్డు, సోమర్సెట్ మెడికల్ బృందం అతడిని పర్యవేక్షించనుంది. అక్కడే లీచ్ కొన్ని రోజులు రిహాబిలిటేషన్లో ఉంటాడు’ అని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే.. లీచ్ స్థానంలో స్క్వాడ్లోకి ఎవరిని తీసుకుంటారనేది మాత్రం వెల్లడించలేదు.
We’re all with you, Leachy ❤️
Nobody braver than you 💪Jack Leach has been ruled out of the remainder of our Test series with India.#INDvENG | #EnglandCricket
— England Cricket (@englandcricket) February 11, 2024
భారత్తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో లీచ్ గాయపడ్డాడు. బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో అతడి మోకాలికి దెబ్బ తగిలింది. దాంతో, ఈ లెఫ్ట్ స్పిన్నర్ రెండో ఇన్నింగ్స్లో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేకపోయాడు. మ్యాచ్ అనంతరం విశ్రాంతి తీసుకున్న లీచ్ వైజాగ్ టెస్టుకు దూరమయ్యాడు. కీలకమైన మూడో టెస్టుకు 12 రోజుల విరామం ఉండడంతో అతడు అందుబాటులో ఉంటాడని ఇంగ్లండ్ భావించింది.
జాక్ లీచ్
కానీ, అతడు కోలుకోకపోవడంతో ఇంగ్లండ్కు పంపించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. జాక్ లీచ్ గైర్హాజరీలో స్పిన్ భారమంతా కుర్రాళ్లు టామ్ హర్ట్లే, రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్లపై పడనుంది. ఉప్పల్ టెస్టులో 7 వికెట్లతో భారత్ను దెబ్బకొట్టిన హర్ట్లే రెండో టెస్టులోనూ రాణించాడు. దాంతో, స్టోక్స్ సేన ఈ యంగ్ త్రయంపై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఇరుజట్ల మధ్య రాజ్కోట్లో ఫిబ్రవరి 15న మూడో టెస్టు జరుగనుంది.