సౌథాంప్టన్: ఊహించినట్లే ఇండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్కు వరుణుడు అడ్డుపడేలా ఉన్నాడు. మ్యాచ్ ప్రారంభ సమయం దగ్గర పడుతున్న సమయంలో సౌథాంప్టన్లో వర్షం కురుస్తోంది. పిచ్తోపాటు గ్రౌండ్లో కొంత భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. గ్రౌండ్ పరిస్థితిని మ్యాచ్ అధికారులు పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. తొలి సెషన్ను రద్దు చేసినట్లు కూడా బీసీసీఐ మరో ట్వీట్లో స్పష్టం చేసింది. మ్యాచ్ తొలి రోజు 65 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం ఐదు రోజులు కూడా వర్షం పడే చాన్స్ ఉంది.