న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మళ్లీ తండ్రయ్యాడు. ఉమేశ్ భార్య తాన్యా వధ్వా ఇవాళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేశ్ యాదవ్ తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా వెల్లడించాడు. ఉమేశ్ యాదవ్ పంజాబ్కు చెందని తాన్యా వధ్వాను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. 2013 మే 29న వారి వివాహం జరిగింది. తాన్య 2021 జనవరి 1న తమ తొలి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో సంతనంగా కూడా ఆడబిడ్డే జన్మించింది.
ఇదిలావుంటే మహిళా దినోత్సవం రోజున మహాలక్ష్మి తన ఇంట్లో అడుగుపెట్టడంతో ఉమేశ్ పట్టరాని సంతోషంలో ఉన్నాడు. ఇన్స్టాలో ఉమేశ్ పోస్టు చూసి అభిమానులు, సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా, ఉమేశ్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ (74) ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశారు.
ప్రస్తుతం ఉమేష్ యాదవ్ ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్నాడు. సిరీస్లో భాగంగా ఇప్పటికే మూడు టెస్టులు పూర్తయ్యాయి. భారత్ రెండు మ్యాచ్లు గెలిచి 2-1 ఆధిక్యంతో ఉన్నది. రేపటి (గురువారం) నుంచి అహ్మదాబాద్ వేదికగా ఆఖరిదైన నాలుగో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఉమేశ్ యాదవ్ మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా..? లేదంటే మ్యాచ్ అనంతరమే బిడ్డను చూసుకోవడానికి వస్తాడా..? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.