న్యూఢిల్లీ : ఈ యేడాది చివరలో మన దేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ వేదికల్లో హైదరాబాద్కు చోటు దక్కిందని సమాచారం. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ప్రపంచకప్ నిర్వహణకు బీసీసీఐ దాదాపు డజను వేదికలను ఎంపిక చేసింది.
46 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో పది జట్లు మొత్తం 48 మ్యాచ్లు ఆడనున్నాయి. ఫైనల్స్ ప్రపంచంలోనే పెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్లో నిర్వహిస్తారు. ఇతర మ్యాచ్లను బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, హైదరాబాద్, కోల్కతా, లక్నో, ఇండోర్, రాజ్కోట్, ముంబైలో నిర్వహిస్తారు. ఫైనల్స్ మినహా తతిమా మ్యాచ్లను ఎక్కడ నిర్వహిస్తారన్న సమాచారం బీసీసీఐ ప్రకటించలేదు.