భారత్తో టెస్టు సిరీస్లో విజయం సాధించి.. టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ సౌతాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా ఒక వార్తాసంస్థతో మాట్లాడుతూ.. సఫారీ జట్టు చాలా తక్కువ టెస్టు మ్యాచులు ఆడుతోందని చెప్పాడు.
‘‘మేం ఒక సంవత్సరంలో ఆరు మ్యాచులు ఆడుతున్నాం. అదే సమయంలో మిగతా జట్లు 15 మ్యాచులు ఆడుతున్నాయి. ఇది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. ఇదే కొనసాగితే మా తరం ఆటగాళ్లకు మునుపటి తరం వారికి వచ్చినంత పేరు రాదు. మూడేళ్లలో 18 మ్యాచులు ఆడితే ఏం సాధించాలన్నా కష్టమే’’ అని వాపోయాడు.
తాము అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్గా నిలవాలని అనుకుంటున్నామని, ఇలాంటి సమయంలో పరిస్థితులు ఇలా ఉండటం దురదృష్టకరమని చెప్పాడు. తాము కూడా చరిత్రపై ముద్రవేయాలని అనుకుంటున్నామని, కేవలం రెండు మ్యాచుల సిరీసులు కాకుండా మరింత టెస్టు క్రికెట్ ఆడే అవకాశం వస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.