న్యూఢిల్లీ: దేశానికి రెండు ప్రపంచకప్లు అందించిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని బీసీసీఐ సముచితంగా గౌరవించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలో ధోనీ వినియోగించిన జెర్సీ నంబర్ 7ను ఇకపై ఎవరికీ ఇవ్వకూడదని నిర్ణయించింది.‘అతడో దిగ్గజం. భారత క్రికెట్కు ధోనీ ఎంతో చేశాడు. మహీ ఘనతలకు గుర్తింపుగా.. ఏడో నంబర్కు రిటైర్మెంట్ ప్రకటించాం’ అని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పేర్కొన్నాడు. గతంలో సచిన్ జెర్సీ నంబర్ (10) విషయంలోనూ బోర్డు ఇదే పనిచేసింది.