Asia Cup | హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత యువ బ్యాటర్ ఇషాన్ కిషాన్ దూకుడు పెంచాడు. శ్రీలంకలో ఆసియాకప్ సందర్భంగా దాయాదులు పాకిస్థాన్, భారత్ మధ్య మ్యాచ్ జరుగుతున్నది. 33వ ఓవర్లో నవాజ్ వేసిన మూడో బంతిని సిక్సర్ బాదాడు. దీంతో ఐదో వికెట్ భాగస్వామ్యానికి ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్య 100 పరుగులు జత చేశారు. 33వ ఓవర్ ముగిసే సమయానికి టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ 66, హార్దిక్ పాండ్యా 46 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
అంతకుముందు 29వ ఓవర్లో ఇషాన్ కిషాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షాదాబ్ ఖాన్ వేసిన 29వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీయడంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 54 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో 29 ఓవర్లు ముగిసే సమయానికి టీం ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.