ఒలింపిక్స్ ఈత కొలనులో పతకం పట్టడం కాదు కదా.. ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా నేరుగా విశ్వక్రీడలకు అర్హత సాధించలేదు. అలాంటిది యువ స్విమ్మర్ ప్రకాశ్ బటర్ఫ్లై విభాగంలో తొలిసారి నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరి మెగాక్రీడలకు క్వాలిఫై అయ్యాడు.
పురుషుల 200 మీటర్ల బటర్ఫ్లై విభాగంలో టోక్యో ఒలింపిక్ క్వాలిఫికేషన్ టైమింగ్ 1:56.48 కాగా.. ఇటీవల రోమ్లో జరిగిన కోలీ ట్రోఫీలో సజన్ ప్రకాశ్ 1:56.38 టైమింగ్ నమోదు చేయడంతో నేరుగా విశ్వక్రీడలకు ఎంపికైన తొలి భారతీయ స్విమ్మర్గా రికార్డు సృష్టించాడు. 2015 జాతీయ క్రీడల్లో 6 స్వర్ణాలు, 3 రజతాలు చేజిక్కించుకున్న 27 ఏండ్ల సజన్.. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు. తాజాగా రోమ్లో జరిగిన పోటీల్లో విశ్వక్రీడల అర్హత టైమింగ్ కంటే 0.10 సెకన్లు ముందే లక్ష్యాన్ని చేరి శెభాష్ అనిపించుకున్నాడు. అయితే ఈ ప్రదర్శనతో పతకాలు ఆశించడం అత్యాశే అయినా.. కొత్త జాతీ య రికార్డులు నమోదుకావడం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది. ప్రకాశ్తో పాటు శ్రీహరి నటరాజ్, మానా పటేల్ కూడా బరిలో దిగనున్నారు.
స్విమ్మింగ్లో మనవాళ్లు..
సజన్ ప్రకాశ్
శ్రీహరి నటరాజ్
మానా పటేల్