హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండియన్ రేసింగ్ లీగ్(ఐఆర్ఎల్) ఆఖరి అంచె పోటీలకు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. అరంగేట్రం సీజన్లో భాగంగా ఈ నెల 10, 11 తేదీల్లో హుసేన్సాగర్ పరిసర ప్రాంతాల్లో ఆఖరి రౌండ్ పోటీలు జరుగనున్నాయి. తొలి దశ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమివ్వగా, చెన్నైలో రెండో, మూడో అంచె రేసింగ్ జరిగింది. ఇందులో హైదరాబాద్ బ్లాక్బర్డ్స్ జట్టు అగ్రస్థానం దక్కించుకుంది. ఇటలీకి చెందిన వోల్ఫ్ థండర్ జీబీ08 కార్లు స్ట్రీట్ సర్క్యూట్లో అభిమానులను అలరించనున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తున్నది.