మీర్పూర్: ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 138 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముష్ఫికర్ రహీమ్ (51 నాటౌట్; 7 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో రాణించాడు.
అంతకుముందు 286/8తో శుక్రవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఐర్లాండ్.. మరో ఆరు పరుగులు మాత్రమే జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్లో ఐర్లాండ్ 214 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్ 369 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో పాటు రెండో ఇన్నింగ్స్లో ఆఫ్ సెంచరీతో రాణించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.