ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. తొలి మ్యాచ్లో ధాటిగా ఆడి ఆకట్టుకున్న ఇషాన్ కిషన్ (3) ఈ మ్యాచ్లో విఫలమయ్యాడు. అడైర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అడైర్ వేసిన బంతిని స్లాగ్ చేసేందుకు ప్రయత్నించిన కిషన్ మిస్సయ్యాడు.
ఈ క్రమంలో అతనికి దూరంగా వెళ్తున్న బంతి.. ఎడ్జ్ తీసుకొని కీపర్ టక్కర్ చేతుల్లో పడింది. దీంతో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా అడైర్అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. మూడు ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.