రాజ్కోట్: బౌలర్ల మెరుపు వేగానికి.. బ్యాటర్ల బాధ్యత తోడవడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న ఇరానీ ట్రోఫీ తొలి రోజే రెస్టాఫ్ ఇండియా పట్టు సాధించింది. మొదట బ్యాటింగ్కు దిగిన సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 98 పరుగులకే ఆలౌటైంది. టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (1) విఫలమయ్యాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేశ్ 4.. కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్టాఫ్ ఇండియా శనివారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. సర్ఫరాజ్ ఖాన్ (125 బ్యాటింగ్; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు.