ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ20 లీగ్ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇదే సమయంలో కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) ముగిసింది. ఈ క్రమంలో ఐపీఎల్ గొప్పా? లేక పీఎస్ఎల్ గొప్పా? అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాట్లాడుతూ పీఎస్ఎల్ ఆదాయం 70 శాతం పెరిగిందని పేర్కొంది. దీంతో ఈ చర్చ మరింత పెద్దదైంది. పీఎస్ఎల్ మొదలైనప్పటి నుంచి ఇలాంటి చర్చ జరుగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా నోరు విప్పాడు. ఈ విషయంలో మరో ఆలోచనే అక్కర్లేదని ఐపీఎల్ ది బెస్ట్ అని తేల్చేశాడీ కంగారూ ప్లేయర్.
‘‘ఈ రెండు టోర్నీల మధ్య అసలు పోటీనే లేదు. ప్రపంచంలో భారతీయ ఆటగాళ్లు కనిపించే ఏకైక టోర్నీ ఐపీఎల్. ఈ ఒక్క కారణం చాలు ఐపీఎల్ బెస్ట్ అని చెప్పడానికి’’ అన్నాడు. కచ్చితంగా ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత బలమైన టోర్నీ అని తేల్చేశాడు. కాగా, ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి దీనిలో పది జట్లు పోటీ పడనున్నాయి. దీనికి అనుగుణంగా షెడ్యూల్ కూడా సిద్ధం చేశారు ఐపీఎల్ నిర్వాహకులు. జట్లను రెండు గ్రూపులుగా విడగొట్టి టోర్నీ నిర్వహించనున్నారు.