న్యూఢిల్లీ: ఐపీఎల్లో పరుగుల వరద పారించిన రజత్ పాటిదార్తో పాటు.. దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న బెంగాల్ పేసర్ ముఖేశ్ కుమార్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. రోహిత్ సారథ్యంలోని టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్లో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఇటీవల న్యూజిలాండ్-‘ఎ’తో మ్యాచ్ల్లో సత్తాచాటిన 29ఏండ్ల ముఖేశ్.. ఇరానీ ట్రోఫీలోనూ దుమ్మురేపుతున్నాడు.
వేగంతో పాటు కచ్చితత్వంతో ఆకట్టుకుంటున్న ముఖేశ్ ఈ ఏడాది రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున 20 వికెట్లు పడగొట్టి భళా అనిపించుకున్నాడు. మరోవైపు రజత్ ఐపీఎల్ ప్లేఆఫ్స్తో పాటు రంజీ ఫైనల్లో సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే.