ముంబై బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. సిక్సర్ల వరద పారిస్తున్నారు. జూనియర్ డివిలయర్స్గా పేరొందిన డివాల్ బ్రీవీస్ పంజాబ్ బౌలర్లైన స్మిత, రాహుల్ చాహర్లకు చుక్కలు చూపించాడు. స్మిత వేసిన ఏడో ఓవర్లో బ్రీవీస్ ఓ సిక్సర్ కొట్టగా.. ఆ తరువాత వచ్చిన తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేసిన రాహుల్ చాహర్ వేసిన బంతులకు ఒక ఫోర్, నాలుగు సిక్సలు బాదాడు. దీంతో ఈ ఒక్క ఓవర్ లోనే 29 పరుగులు రాబట్టాడు.
బ్రివీస్కు తోడుగా తిలక్ వర్మ కూడా లివింగ్ స్టోన్ వేసిన ఎనిమిదో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. వైభవ్ అరోరా వేసిన పదో ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ కొట్టాడు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై స్కోరు 105/2 ఉంది. డివాల్డ్ బ్రీవీస్ (45 నాటౌట్), తిలక్ వర్మ (27 నాటౌట్)గా ఉన్నారు.
అంతకు ముందు ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(28) నాలుగో ఓవర్లో కగిసో రబడ వేసిన బంతికి ఔట్ కాగా.. వైభవ్ అరోరా వేసిన అయిదవ ఓవర్లో ఓపెనర్ ఇషాన్ కిషన్(3) కూడా పెవిలియన్ దారి పట్టాడు.
ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఆడుతున్న మ్యాచ్లో టాస్ నెగ్గి ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబైకి 199 పరుగుల బిగ్ టార్గెట్ నిర్దేశించింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు.