ఐపీఎల్ టోర్నీలో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మంగళవారం రాత్రి ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్లో చివరి ఓవర్లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 67, కేఎల్ రాహుల్ 49 పరుగులు చేసినా జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు.
చివరి ఓవర్లో పంజాబ్ విజయానికి నాలుగు పరుగులు అవసరం. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ కార్తీక్ త్యాగి అద్భుతంగా బౌలింగ్తో రెండు వికెట్లు తీసి కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. దీంతో పంజాబ్ కింగ్స్ ఎలెవెన్కు ఓటమి తప్పలేదు. తొలి నుంచి పంజాబ్ విజయం దిశగా సాగినా చివరి ఓవర్లో అంతా మారిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 185 పరుగులు చేసి.. పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.