IPL : ఇంగ్లండ్పై టీమిండియా టెస్టు సిరీస్ విజయాన్ని ఎంజాయ్ చేసిన అభిమానులను మరో క్రికెట్ పండుగ అలరించనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 17 సీజన్ మరో 12 రోజుల్లో అరంభం కానుంది. దాంతో, తమ అభిమాన ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలు, కుర్ర హిట్టర్ల సుడిగాలి ఇన్నింగ్స్లు చూసి తరించేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్(Arun Dhumal) అభిమానులకు గుడ్న్యూస్ చెప్పాడు. 17వ సీజన్ ముగిసిన తర్వాత ఐపీఎల్ మెగా వేలం(IPL Mega Auction) నిర్వహిస్తామని ధుమాల్ తెలిపాడు.
‘ఐపీఎల్ మెగా వేలం కచ్చితంగా నిర్వహిస్తాం. అయితే.. అన్ని ఫ్రాంచైజీలు ముగ్గురు లేదా నలుగురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకోవాల్సి ఉంటుంది. వేలం తర్వాత ప్రతి ఫ్రాంచైజీకి కొత్త టీమ్ ఏర్పడుతుంది. ఏ జట్టు ఎంత బలంగా ఉంటుంది? అనేది ఆసక్తికరంగా ఉండనుంది’ అని స్పోర్ట్స్టార్తో ధుమాల్ చెప్పుకొచ్చాడు. అయితే.. ఐపీఎల్ 17వ సీజన్ పూర్తి షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారు? అనేది మాత్రం ధుమాల్ చెప్పలేదు.
That’s a GRAND return to the IPL for Mitchell Starc 😎
DO NOT MISS the record-breaking bid of the left-arm pacer who will feature for @KKRiders 💜💪#IPLAuction | #IPL pic.twitter.com/D1A2wr2Ql3
— IndianPremierLeague (@IPL) December 19, 2023
ప్రతి మూడేండ్లకు ఓసారి భారీ స్థాయిలో ఐపీఎల్ వేలం పాటను నిర్వహిస్తారు. 2008 నుంచి ఈ సంప్రాదాయన్ని బీసీసీఐ కొనసాగిస్తూ వస్తోంది. ఇంతకుముందు 2022లో మెగా వేలం పూర్తైంది. దాంతో, ఆనవాయితీ ప్రకారం మూడేండ్ల తర్వాత అంటే 2025లో మెగా వేలం జరిపేందుకు బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి సిద్ధమవుతోంది.
ఈసారి ఐపీఎల్ ఆరంభ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(CSK)తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తలపడనుంది. మే 25 లేదా 26న ఈ మెగా టోర్నీ ముగియనుంది. ఆ తర్వాత నాలుగైదు రోజులకే.. జూన్ 1న టీ20 వరల్డ్ కప్ షురూ కానుంది.
ఈసారి పొట్టి ప్రపంచకప్ పోటీలకు వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. 20 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ జట్లు డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 9న న్యూయార్క్ వేదికగా తలపడనున్నాయి.