న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) జల్బోర్డు ప్లాంటులో ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు ఓ చిన్నారి పడిపోయింది. కేశోపూర్ మండిలోని బోరుబావిలో (Borewell) చిన్నారి పడిపోయిందని, ప్రస్తుతం 40 ఫీట్ల లోతులో ఉన్నదని అధికారులు తెలిపారు. చిన్నారని రక్షించడానికి ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. బోరు బావికి సమాంతరంగా గుంత తొవ్వుతున్నారు. చిన్నారికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.