ముంబై: ఐపీఎల్లో రికార్డుల పరంపర కొనసాగుతున్నది. మ్యాచ్ల్లో పరుగుల వరద పారినట్లే..17వ సీజన్ తొలి పోరును రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు. చెన్నై, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ను ఏకంగా 16.8 కోట్ల మంది చూసినట్లు డిస్నీ స్టార్ గురువారం ప్రకటించింది. ఇది గత సీజన్తో పోల్చుకుంటే ఎక్కువని తెలిపింది.