IPL 2023 : వెస్టిండీస్ వికెట్ కీపర్, బ్యాటర్ నికోలస్ పూరన్ ఐపీఎల్ 2023 వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయాడు. రూ.2 కోట్ల కనీస ధరతో ఉన్న అతడిని రూ.16 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. దాంతో వేలంలో అత్యంత ధర పలికిన నాలుగో ఆటగాడిగా పూరన్ గుర్తింపు సాధించాడు. పూరన్ గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకు ఆడాడు. వేలంలో అతడిని రూ.10.75 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. అయితే.. అతను 14 మ్యాచుల్లో కేవలం 306 రన్స్ చేశాడంతే. దాంతో పూరన్ను అట్టిపెట్టుకునేందుకు జట్టు ఆసక్తి చూపించలేదు. ఇంతకు ముందు పూరన్, పంజాబ్ కింగ్స్కు ఆడాడు.
ఈసారి ఐపీఎల్ వేలంలో ఇంగ్లండ్ ఆటగాళ్ల పంట పండింది. ఆల్రౌండర్లు సామ్ కరన్ (రూ.18.50 కోట్లు), బెన్ స్టోక్స్ (రూ.17.25 కోట్లు), హ్యారీ బ్రూక్ (రూ. 13.25 కోట్లు) అత్యధిక ధర పలికారు. భారత ఆటగాళ్లలో మయాంక్ అగర్వాల్ రూ. 8.5 కోట్లకు అమ్ముడుపోయాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఉన్న ఇతడిని ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది.
Congratulations to @nicholas_47
He will now play for @LucknowIPL #TATAIPLAuction | @TataCompanies pic.twitter.com/ufrPAZawaW
— IndianPremierLeague (@IPL) December 23, 2022