న్యూఢిల్లీ: రెండు కొత్త ఫ్రాంచైజీలు లక్నో, అహ్మదాబాద్కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పాలక మండలి ఆమోదం తెలిపింది. కొత్త ఫ్రాంచైజీలకు త్వరలోనే ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్వోసీ)’ అందించాలని మంగళవారం జరిగిన సమావేశంలో పాలక మండలి నిర్ణయించింది. ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ అనగా ఈ రెండు జట్లు ఐపీఎల్లో అధికారికంగా చేరినట్టు ఇచ్చే ధృవపత్రం. ‘రెండు బిడ్లకు ఈ రోజు మండలి ఆమోదం తెలిపింది. త్వరలోనే ఎల్వోసీ అందిస్తాం. ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడానికి కొత్త ఫ్రాంచైజీలకు 10 నుంచి 14 రోజుల సమయం ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం’ అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ తెలిపారు. ‘ఇప్పటి వరకైతే భారత్లోనే ఐపీఎల్ ఉండనుంది. కానీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇతర ప్రాంతాల్లో నిర్వహించడంపై ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఐపీఎల్ మెగావేలం తేదీ, వేదికను మార్చబోం’ అని బ్రిజేశ్ పేర్కొన్నారు.