IPL 2025 | రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్, కోచ్ ద్రవిడ్ మధ్య విభేదాలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోనే నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ బుధవారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.
సూపర్ ఓవర్కు ముందు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్లేయర్స్, సహాయక సిబ్బందితో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో కెప్టెన్ సంజు శాంసన్ పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం కనిపించింది. దాంతో అందరూ జట్టులో ఏదీ సరిగా జరుగడం లేదని.. ఇది చీలికకు సంకేతాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్లో ఈ సీజన్ తొలి సూపర్ ఓవర్ బుధవారం జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలు ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ సైతం 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్కోర్ సమం కావడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే, సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నితీశ్ రాణాకు అవకాశం ఇవ్వలేదు. ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు.
అయితే, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హిట్మెయిర్, రియాన్ పరాగ్ రాజస్థాన్ తరఫున సూపర్ ఓవర్లో బ్యాటింగ్కు వచ్చారు. అయితే, టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై ప్రస్తుతం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మ్యాచ్ తర్వాత నితీశ్ మాట్లాడుతూ.. ఇలాంటి నిర్ణయాలు ఒకరే తీసుకోరని.. కెప్టెన్, కోచ్, జట్టుతో కలిసి నిర్ణయం తీసుకుంటారన్నారు. మ్యాచ్ గెలిస్తే ఎవరూ నిర్ణయాన్ని ప్రశ్నించే వారు కాదని పేర్కొన్నారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడగా.. రెండింట్లో గెలిచి.. ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది.
I knew there was definitely a rift within the setup when there were absolutely no discussions or chat in the dugout before the super over.Everyone was standing quite in a circle in the dugout.Look at Sanju’s hand signal in the first video,he is deliberately ignoring everyone. https://t.co/DfxmlwGgBG pic.twitter.com/688ji3MXrS
— Delhi Capitals Fan (@pantiyerfc) April 17, 2025