RR vs GT | గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో సంజూ శాంసన్ రియాన్ పరాగ్ చెలరేగారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ స్కోర్ అందించారు. గుజరాత్ ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ దూకుడుగా ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 24 పరుగులు ) మొదటి మూడు ఓవర్లు చెలరేగి ఆడాడు. కానీ నాలుగో ఓవర్లో ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి క్యాచ్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (10 బంతుల్లో 8 పరుగులు) విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్( 38బంతుల్లో 68 పరుగులు ) , రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76 పరుగులు ) పరుగుల వేటలో దుమ్ముదులిపేశారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో జట్టుకు కీలక స్కోర్ను అందించారు. అయితే వీళ్ల భాగస్వామ్యానికి 19వ ఓవర్లో బ్రేక్ పడింది. 18.4 ఓవర్కు మోహిత్ శర్మ వేసిన బంతికి పరాగ్ ఔటయ్యాడు. పరాగ్ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్మయిర్ ( 5 బంతుల్లో 13 పరుగులు ) కూడా ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 197 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది.