IPL 2024 | ఐపీఎల్ – 17లో కొత్త కెప్టెన్తో బరిలోకి దిగబోతున్న ముంబై ఇండియన్స్లో విభేదాలకు పుల్స్టాప్ పడ్డట్టే కనిపిస్తోంది. ఈ సీజన్కు రెండు నెలల ముందు రోహిత్ శర్మను సారథిగా తప్పించిన ముంబై యాజమాన్యం.. హార్ధిక్ పాండ్యాకు బాధ్యతలను అప్పజెప్పింది. అయితే కెప్టెన్సీ మార్పుతో ముంబై ఫ్యాన్స్తో పాటు టీమ్లోనూ విభేదాలు భగ్గుమన్నాయి. ముంబై స్టార్ ప్లేయర్లు అయిన సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రాలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అయితే ముంబై యాజమాన్యంపై దుమ్మెత్తిపోశారు. ఇటీవలే నిర్వహించిన విలేకరుల సమావేశంలో హార్ధిక్తో పాటు హెడ్కోచ్ మార్క్ బౌచర్లు కెప్టెన్సీ మార్పుపై ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడంతో ముంబై టీమ్లో విభేదాలు నిజమేనన్న అనుమానం కలిగింది.
విలేకరుల సమావేశంలో పాండ్యాకు.. కెప్టెన్గా నియమితుడయ్యాక రోహిత్తో మాట్లాడారా..? అన్న ప్రశ్న ఎదురైంది. దానికి హార్ధిక్.. ‘లేదు. మేమిద్దరం నేరుగా కలుసుకునే అవకాశమే రాలేదు. రోహిత్ ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కారణంగా బిజీబిజీగా ఉన్నాడు. త్వరలోనే అతడు ముంబై టీమ్తో కలుస్తాడు. అప్పుడు మాట్లాడతా..’ అని అన్నాడు. తాజాగా రోహిత్.. సోమవారమే ముంబై క్యాంప్లో చేరినా హార్ధిక్, హిట్మ్యాన్లు కలిసినట్టు వార్తలైతే రాలేదు. కానీ తాజాగా ఈ ఇద్దరూ ఆలింగనం చేసుకున్న వీడియోను ముంబై రిలీజ్ చేసింది. తద్వారా ముంబై క్యాంప్లో విభేదాలు ఏమీ లేనట్టు తేల్చి చెప్పింది.
𝟰𝟱 🫂 𝟯𝟯#OneFamily #MumbaiIndians | @hardikpandya7 @ImRo45 pic.twitter.com/eyKSq7WwCV
— Mumbai Indians (@mipaltan) March 20, 2024
తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియోలో.. ముంబై ప్లేయర్లంతా ప్రాక్టీస్ చేస్తుండగా అక్కడే ఉన్న రోహిత్ను చూసిన పాండ్యా వెళ్లి రోహిత్ను హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ముచ్చటించుకున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ ముంబై 45 హగ్స్ 33 అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.