IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి ఎంట్రీ ఇచ్చి రెండేండ్లే అయినా రెండు పర్యాయాలు ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్.. మూడోసారి కూడా ఫైనల్ చేరుతుందని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండేండ్లలో గుజరాత్కు సారథిగా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా.. ఈ ఏడాది బదిలీ ప్రక్రియలో భాగంగా ముంబై ఇండియన్స్కు మళ్లిన విషయం తెలిసిందే. అయితే హార్ధిక్ లేకున్నా ఈసారి గుజరాత్ టైటాన్స్.. శుభ్మన్ గిల్ సారథ్యంలో ఫైనల్ ఆడుతుందని హగ్ అన్నాడు.
హగ్ మాట్లాడుతూ… హార్ధిక్ ముంబైకి వెళ్లడంతో గుజరాత్ ఫ్యాన్స్ నిరూత్సాహానికి గురై ఉంటారు. అయితే ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. పాండ్యా లేకున్నా గుజరాత్.. 2024 ఐపీఎల్ ఫైనల్ చేరుతుంది.. అని అన్నాడు.
చెన్నైకి పంత్..?
చెన్నై సూపర్ కింగ్స్ వచ్చే ఏడాది టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కోసం ప్రయత్నించే అవకాశం ఉందని, ధోని స్థానాన్ని అతడు భర్తీ చేయగలడని భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా అన్నాడు. గుప్తా మాట్లాడుతూ.. “పంత్ ధోనీని ఆరాధిస్తాడు. ధోనీకి కూడా పంత్ అంటే ఇష్టం. ఈ ఇద్దరూ భారత క్రికెట్తో పాటు ఐపీఎల్ ఆడేప్పుడు చాలా కలివిడిగా ఉన్నారు. ఈ ఇద్దరి ఆలోచనా విధానం కూడా ఒకే విధంగా ఉంటుంది. వచ్చే ఏడాది ధోని ఐపీఎల్లో ఆడేది లేనిది తెలియదు కాబట్టి సీఎస్కే పంత్ కోసం ప్రయత్నించే అవకాశముంది..” అని చెప్పాడు.