IPL 2023 : క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదహారో సీజన్ రేపటితో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా 10 జట్ల కెప్టెన్లు ఈరోజు ట్రోఫీతో ఫొటోలకు పోజిచ్చారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోనీ (Chennai Super Kings), హార్దిక్ పాండ్యా (Gujarat Titans), కేఎల్ రాహుల్ (లక్నో సూప్ జెయింట్స్), సంజూ శాంసన్ (రాజస్థాన్ రాయల్స్), శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్), నితీశ్ రానా (కోల్కతా నైట్ రైడర్స్), డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్),
కెప్టెన్ మర్క్రమం బదులు భువనేశ్వర్ కుమార్ (సన్రైజర్స్ హైదరాబాద్)లు ట్రోఫీతో కలిసి ఫోటోలు దిగారు. అయితే.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఈవెంట్కు హాజరు కాలేదు. రేపు (మార్చి 31న) సాయంత్రం 5ః30 గంటలకు ఐపీఎల్ పండుగ షురూ కానుంది. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి జై షాతో పాటు పలువురు అధికారులు టోర్నీ ప్రారంభ వేడుకలకు హాజరుకానున్నారు.
Game Face 🔛
ARE. YOU. READY for #TATAIPL 2023❓ pic.twitter.com/eS5rXAavTK
— IndianPremierLeague (@IPL) March 30, 2023
ఐపీఎల్ ఆరంభ వేడుకలను అట్టహాసంగా, కన్నులపండువగా జరగనున్నాయి. అందుకని సినీ సెలబ్రిటీలు, బాలీవుడ్ సింగర్స్తో బీసీసీఐ ప్రదర్శనలు ఏర్పాటు చేసింది. తెలుగు, కన్నడతో పాటు బాలీవుడ్లోనూ పాపులర్ అయిన రష్మిక మందాన(Rashmika Mandanna), మిల్క్బ్యూటీ తమన్నా భాటియా(Tamanna Bhatia,) డాన్స్తో అలరించనున్నారు. బాలీవుడ్ ఫేమస్ సింగర్ అర్జిత్ సింగ్ పాటలతో స్టేడియాన్ని హోరెత్తించనున్నాడు. అనంతరం పది జట్ల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్, నాలుగుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
గత సీజన్లతో పోల్చితే ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ఉండనుంది. టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు బీసీసీఐ కొన్నికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అవేంటటే.. ప్రతి జట్టు సొంత గ్రౌండ్లో ఏడు మ్యాచ్లు ఆడనుంది. ప్రతి టీమ్ ఇంప్యాక్ట్ ప్లేయర్ను తీసుకొనే వెసులుబాటు ఉంది. అంతేకాదు టాస్ తర్వాత కూడా తుది జట్టులో మార్పులు చేసుకొనే వీలుంది.