గువాహటి: ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లు తమతమ తొలి మ్యాచ్లలో విజయం సాధించి ఊపు మీదున్నాయి. ఏప్రిల్ 1న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన తన తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 7 పరుగుల తేడాతో గెలిచింది.
రాజస్థాన్ రాయల్స్ కూడా ఏప్రిల్ 2న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన తన తొలి మ్యాచ్లో 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్లు గెలిచిన ఊపులో ఉన్న ఈ రెండు జట్లు ఇవాళ ముఖాముఖి తలపడుతున్నాయి. అసోం రాజధాని గువాహటిలోని బర్సపారా స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది.
IPL 2023 ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా గువాహటిలోని బర్సాపర స్టేడియంలో బుధవారం (RR)రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్(PBKS) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. చివరి బంతిదాకా ఉత్కంఠభరితంగా కొనసాగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచినా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ పోరాడి ఓడింది. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులే చేసింది.
పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడారు. ఒకరిని మించి మరొకరు దొరికిన బంతిని దొరికినట్టుగా బాదారు. ట్రెంట్ బౌల్ట్, అశ్విన్, చహల్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను క్లబ్ స్థాయి బౌలర్లుగా మారుస్తూ వీరబాదుడు బాదారు. పంజాబ్ ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 60 (34 బంతుల్లో, 3 సిక్స్లు, 7 ఫోర్లు) సిక్సర్లు, ఫోర్లు దంచి కొట్టాడు. మరో ఓపెనర్, కెప్టెన్ శిఖర్ ధావన్ (56 బంతుల్లో 86 నాటౌట్, 9 ఫోర్లు,3 సిక్సర్లు), నాలుగో స్థానంలో వచ్చిన జితేశ్ శర్మ (16 బంతుల్లో 27, 2 ఫోర్లు, 1 సిక్స్) లు ధాటిగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్.. 4 వికెట్లు నష్టపోయి 197 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు. పంజాబ్ బ్యాట్స్మెన్లో శిఖర్ ధావన్ (86 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యజువేంద్ర చాహల్, కేఎం ఆసిఫ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆసిఫ్ నాలుగు ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకోగా, చాహల్ 50 పరుగులు ఇచ్చాడు. జాసన్ హోల్డర్ రెండు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు. మరో బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 38 పరుగులు సమర్పించుకున్నాడు.
ఆ తరువాత 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్కు ఆశించిన ఆరంభం లభించలేదు. రవిచంద్రన్ అశ్విన్ను (0) ఓపెనర్గా పంపినా ప్రయోగం ఫలించలేదు. అశ్విన్ నాలుగు బంతులు ఆడి ఖాతా తెరవకుండా అవుటయ్యాడు. యశస్వి జైస్వాల్ (11, 8 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), జోస్ బట్లర్ (11 బంతుల్లో 19, ఒక ఫోర్, ఒక సిక్సర్) కూడా విఫలం అయ్యారు. దీంతో రాజస్తాన్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సంజు శామ్సన్ ( 25 బంతుల్లో 42, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), దేవ్దత్ పడిక్కల్ ( 26 బంతుల్లో 21, ఒక ఫోర్) ఇన్నింగ్స్ను కుదుటపరిచారు. సంజు వేగంగానే ఆడినా దేవ్దత్ పడిక్కల్ మరీ నిదానంగా ఆడటంతో చేయాల్సిన రన్రేట్ పెరిగిపోయింది. వీళ్లిద్దరూ నాలుగో వికెట్కు 34 పరుగులు జోడించారు. 91 పరుగుల వద్ద సంజు శామ్సన్ అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే రియాన్ పరాగ్ (12 బంతుల్లో 20, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), దేవ్దత్ పడిక్కల్ కూడా అవుటయ్యారు. దీంతో 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి రాజస్తాన్ ఓటమి అంచున నిలిచింది.
ఈ దశలో షిమ్రన్ హెట్మేయర్ (18 బంతుల్లో 36, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), కొత్త కుర్రాడు ధ్రువ్ జోరెల్ (15 బంతుల్లో 32 నాటౌట్, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) భారీ షాట్లు కొడుతూ ఇన్నింగ్స్ను పరిగెత్తించారు. వీరు కేవలం 27 బంతుల్లోనే 62 పరుగులు జోడించారు. అయితే చివరి ఓవర్లో షిమ్రన్ హెట్మేయర్ అవుట్ కావడంతో మ్యాచ్ రాజస్తాన్ చేతికి వచ్చింది. హెట్మేయర్ స్థానంలో వచ్చిన హోల్డర్ (1 నాటౌట్) క్రీజులోకి వచ్చీరాగానే భారీ షాట్లు ఆడలేకపోయాడు. దీంతో పంజాబ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులకు పరిమితం అయింది.
198 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ధాటిగా ఆట మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్ (11 - 8 బంతుల్లో ఒక సిక్సర్, ఒక ఫోర్) రెండో ఓవర్ మూడో బంతికి అర్షదీప్ బౌలింగ్లో ఔటయ్యాడు. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ మాథ్యూ షార్ట్ చక్కని క్యాచ్తో జైస్వాల్ను పెవిలియన్కు పంపించాడు.
ఇవాళ్టి ఐపీఎల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ ముందు 198 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
పంజాబ్ కింగ్స్ జట్టు 20 ఓవర్ నాలుగో బంతికి నాలుగో వికెట్ పోగొట్టుకుంది. జాసన్ హోల్డర్ బౌలింగ్లో జాస్ బట్లర్కు క్యాచ్ ఇచ్చిన షారూఖ్ ఖాన్ 11 (9 బంతుల్లో) వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 196 పరుగులు.
కేఎం ఆసిఫ్ బౌలింగ్ను పంజాబ్ బ్యాటర్లు ఓ ఆటాడుకున్నారు. 19వ ఓవరలో తన నాలుగో ఓవర్ వేసిన ఆసిఫ్ ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో పంజాబ్ స్కోరు 190కి చేరింది. ధావన్ 85, షారూఖ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పంజాబ్ కింగ్స్ జట్టు 18 ఓవర్ల ఆట ముగిసే సరికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 50 బంతుల్లో 73 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అందులో రెండు సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ షారూఖ్ ఖాన్ ఐదు బంతుల్లో ఐదు పరుగులతో కొనసాగుతున్నాడు. జాసన్ హోల్డర్ బౌలింగ్లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ (73*) రివర్స్స్వీప్ షాట్తో సిక్స్ కొట్టి అబ్బురపరిచాడు.
ప్రారంభంలో దూకుడుగా ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 16వ, 17వ ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 16వ ఓవర్లో చాహల్ బౌలింగ్లో జితేశ్ శర్మ ఔట్ కాగా, 17వ ఓవర్ తొలి బంతికి సికిందర్ రజా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
పంజాబ్ టీమ్ రెండో వికెట్ కోల్పోయింది. 16వ ఓవర్ నాలుగో బంతికి పంజాబ్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ ఔటయ్యాడు. యజువేంద్ర చాహల్ బౌలింగ్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి శర్మ పెవిలియన్ ముఖం పట్టాడు. చాహల్ బౌలింగ్లో జితేశ్ శర్మ (27) భారీ షాట్కు ప్రయత్నించి లాంగాఫ్లో రియాన్ పరాగ్ చేతికి చిక్కాడు.
పంజాబ్ బ్యాటర్ల దూకుడు కొనసాగుతున్నది. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ 34 బంతుల్లోనే 60 పరుగులు చేసి ఔట్ కాగా.. కెప్టెన్ ధావన్, జితేశ్ శర్మ అదే దూకుడు కొనసాగిస్తున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ధావన్ 58, జితేశ్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.
పంజాబ్ బ్యాటర్ల ధాటికి రాజస్థాన్ బౌలర్లు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా యజువేంద్ర చాహల్, కేఎం ఆసిఫ్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. 14 ఓవర్లు ముగిసే సరికి చాహల్, ఆసిఫ్ చెరో మూడు ఓవర్లు బౌలింగ్ చేసి వరుసగా 43, 39 పరుగులు ఇచ్చారు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 14వ ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టడం ద్వారా ధావన్ స్కోరు 50 పరుగులకు చేరింది. మొత్తం ఒక సిక్సర్, ఆరు ఫోర్ల సాయంతో ధావన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ అర్ధ సెంచరికీ చేరువయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 125 పరుగులు కాగా.. ధావన్ స్కోరు 34 బంతుల్లో 42 పరుగులు. ధావన్ ఇన్నింగ్స్లో ఒక సిక్సర్, నాలుగు ఫోర్లు ఉన్నాయి.
దూకుడుగా బ్యాటింగ్ మొదలుపెట్టిన పంజాబ్ జట్టు 12వ ఓవర్లో 100 పరుగుల మైలురాయిని దాటింది. 12వ ఓవర్ మూడో బంతికి జితేశ్ శర్మ ఫోర్ కొట్టడంతో జట్టు స్కోరు 102కు చేరింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 30, జితేశ్ శర్మ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఓపెనర్ ప్రభ్ సింగ్ ఔట్ కాగానే ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన పంజాబ్ బ్యాటర్ భానుక రాజపక్స కేవలం ఒక్క బంతిని ఎదుర్కొని రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఒక బంతిని ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అశ్విన్ బౌలింగ్లో శిఖర్ ధావన్ ఆడిన బంతి నేరుగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న భానుక రాజపక్స చేతికి తగలడంతో నొప్పికి విలవిల్లాడి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
ఐపీఎల్లో ఇవాళ్టి మ్యాచ్లో దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు 10వ ఓవర్లో తొలి వికెట్ కోల్పోయింది. పదో ఓవర్ నాలుగో బంతికి జాసన్ హోల్డర్ బౌలింగ్లో ప్రభ్ సిమ్రన్ ఔటయ్యాడు. జాస్ బట్లర్ చక్కటి క్యాచ్తో ప్రభ్ సిమ్రన్ను పెవిలియన్కు పంపాడు. సిమ్రన్ 34 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 60 పరుగులు చేశాడు.
పంజాబ్ బ్యాటర్ ప్రభ్ సిమ్రన్ తన జోరు కొనసాగిస్తూనే ఉన్నాడు. దాంతో తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ జట్టు వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రన్ ఊపు చూస్తుంటే ఈ మ్యాచ్లో సెంచరీ చేసేలా కనిపిస్తున్నాడు.
పంజాబ్ బ్యాటర్ ప్రభ్ సిమ్రన్ దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 7.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 75 పరుగులు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ స్పిన్నర్ ఏడో ఓవర్లో ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. అశ్విన్ పకడ్బీందీగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ బ్యాటర్లో ఏడో ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే చేయగలిగారు.
పంజాబ్ ఓపెనింగ్ బ్యాటర్ ప్రభ్సిమ్రాన్ వీరవిహారం చేస్తున్నాడు. ఇవాళ రాజస్థాన్తో మ్యాచ్లో కేవలం 23 బంతుల్లోనే 45 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ నిలకడగా ఆడుతున్నాడు.
ఐపీఎల్ సీజన్-16లో రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. బ్యాటర్ల విజృంభణతో తొలి ఐదు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు వికెట్ నష్టపోకుండా 56 పరుగులకు చేరింది.
ఇవాళ పంజాబ్తో మ్యాచ్కు రాజస్థాన్ రాయల్స్ టాస్ నెగ్గింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్కు గువాహటి మైదానం రెండో హోం గ్రౌండ్ కావడం విశేషం.