మొహాలీ: ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీమ్ భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచినా పిచ్పై తేమ ఉందన్న కారణంతో ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ టీమ్ అంచనాలను తలకిందులు చేస్తూ 200 పైగా పరుగులు పిండుకుంది. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి.. ముంబై ఇండియన్స్ ముందు 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
పంజాబ్ బ్యాటర్లలో లియామ్ లివింగ్స్టోన్ అద్భుతంగా రాణించాడు. మొత్తం 42 బంతులను ఎదుర్కొని 195 స్ట్రైక్ రేట్తో 82 పరుగులు రాబట్టాడు. అందులో 4 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. లివింగ్స్టోన్కు వికెట్ కీపర్ జితేశ్ శర్మ చక్కటి సహకారం అందించాడు. 27 బంతుల్లో 2 సిక్సర్లు, 5 ఫోర్లతో 49 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో కెప్టెన్ శిఖర్ ధావన్ (30), మాథ్యూ షార్ట్ (27) రాణించారు. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేయలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో పీయూష్ చావ్లా 2 వికెట్లు, అర్షద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.